క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కా శర్మల ప్రేమ తిరిగి గాడిలో పడింది. సుల్తాన్ సినిమా షూటింగ్ కోసం గురువారం బుడాపెస్ట్ వెళ్లిన అనుష్కాకు, కోహ్లీ గ్రాండ్గా సెండాఫ్ చెప్పాడు. తన కారులో అనుష్కను ఎయిర్పోర్టు వరకు డ్రాప్ చేశాడు. అక్కడ వారిద్దరు కారులో కొంత సేపు మాట్లాడుకున్నారు. అనుష్క కారు దిగే ముందు కోహ్లీ ఆమెను కౌగిలించుకుని ముద్దిచ్చి మరి సెండాఫ్ చెప్పాడు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొన్ని నెలల కిందట వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, విడిపోయారనే వదంతులు వినిపించాయి. అయితే నటుడు సల్మాన్ ఖాన్ చొరవతో ఈ జంట తమ బంధాన్ని తిరిగి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అనుష్కా పుట్టిన రోజున విరాట్ కోహ్లీ ఆమెకు ఖరీదైన బహుమతి ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెప్పాడు. ఇటీవల వారిద్దరు కలిసి డిన్నర్ చేయడంతో వీరి ప్రేమ తిరిగి గాడిలో పడినట్లు తెలుస్తోంది.